తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా నియమితులై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకొని రెండవ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు రంగినేని అభిలాష్ రావు టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆయన టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీపనగండ్ల మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, వీపనగండ్ల మండల అధ్యక్షుడు గోదల బీరయ్య యాదవ్, పెంట్లవెల్లి మండల అధ్యక్షుడు నరసింహ యాదవ్, కాంగ్రెస్ నాయకులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.