విజయనగరం జిల్లా కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ..చార్జ్ తీసుకుని ఏడాది పూర్తి అవుతున్న సందర్భంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిమంది వీఆర్వో లకు వివిధ కారణాలతో వాళ్ళకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఆ జాబితా లో విజయనగరం-2,పూసపాటి రేగ-2,బొండపల్లి-2,ఎల్.కోట-2,వేపాడ-1,ఎస్.కోట-1..వీఆర్వో లకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసారు. క్రమశిక్షణ చర్యలలో భాగమైన పలు అంశాలపై ఇటీవలే తన ఆకస్మిక తనిఖీ లలో బయటపడిన అంశాలపై కలెక్టర్ ఈ సంచలన మైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏదైనా విజయనగరం జిల్లా కలెక్టర్ గా ఏడాది పూర్తవుతున్న వేళ…ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయం ఓ వైపు జిల్లా యంత్రాంగం.. అలెర్ట్ అవడంతో పాటు అపు ప్రజా ప్రతినిధులు సైతం ఒకింత జాగ్రత్తగా నే ఉంటున్నట్టు సమాచారం.