ఉపాధ్యాయ బదిలీలు 2023 ప్రక్రియ లో భాగంగా 317 జీవో ప్రకారం బదిలీ అయిన ఉపాధ్యాయులు తిరిగి బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ములుగు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. దీని కోసం దరఖాస్తు చేసుకునేందుకు 14 వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా
1. Online లో బదిలీ దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా వారి వివరాలు సంబంధిత D.D.O తో తనిఖీ చేయించి, సంతకం చేయించుకోవాలి.
2. సంబంధిత D.D.O లు ఆ బదిలీ దరఖాస్తు ను ఉపాధ్యాయుని Original Service Register మరియు సంబంధిత సర్టిఫికెట్ ల ఆధారంగా verify చేసి, సరియైన వివరాలు పొందుపరచబడినవని ధృవీకరిస్తూ సంతకం చేసి, ఆ బదిలీ దరఖాస్తు ను సంబంధిత మండల విద్యాధికారి కి అదేరోజు సమర్పించాలి.
3. మండల విద్యాధికారులు వారికి చేరిన బదిలీ ధరఖాస్తులను మరొక మారు verify చేసి, అదేరోజు సాయంత్రం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ములుగుకు సమర్పించాలి.
4. సంబంధిత D.D.O. సంతకం లేని బదిలీ దరఖాస్తులు స్వీకరించబడవు.