34.2 C
Hyderabad
May 13, 2024 17: 20 PM
Slider జాతీయం

హరాస్మెంట్:రిపోర్టర్,వార్డ్ మెంబెర్ వేధింపులతో ఆత్మహత్య

harrasment reporter eo

పత్రిక విలేకరి, గ్రామ పంచాయితీ సభ్యుడి లైంగిక వేధింపులకు తట్టుకోలేక ఒక లేడీ ఆఫీసర్ మరణించిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది`. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని భారతీనగర్‌ లో గ్రామ పంచాయితీ ఆఫీసర్ గా అనితా రాజేశ్వరి పనిచేస్తుండగా గత సంవత్సర కాలం గా ఓ వారపత్రిక విలేకరి, మరో సహోద్యోగి ఆమెను వేధిస్తున్నారు.

అక్కడే రూరల్ పోలీసు స్టేషన్ లో అనితా రాజేశ్వరి తల్లి ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తుండగా విషయం ఆమెతో చెప్పింది. ఆమె వారిని పిలిపించి వేధింపులు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించినా వారి వైఖరి మారలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనితా రాజేశ్వరి మంగళవారం నాడు తన కార్యాలయంలోనే విషం తాగింది. విషయాన్ని గుర్తించిన తోటి సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసును రిజిస్టర్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

Related posts

22 ఏళ్లయినా `కార్గిల్’ గుణపాఠం గ్రహించలేక పోతున్నామా?

Satyam NEWS

గోవా ఎమ్మెల్యే ప్రసాద్ గాంకర్ రాజీనామా

Sub Editor

కార్డన్ సెర్చ్: కంచికచర్లలో పోలీసుల కొత్త ప్రయోగం

Satyam NEWS

Leave a Comment