ఇది సినిమా కథ కాదు. అంతకన్నా ఎక్కువే. భర్త తాగుబోతు అయినా తిరుగుబోతు అయినా వ్యవసనపరుడు అయినా భరించి కాపురం చేసే మహిళలను చూశాం. కానీ ఈ అమ్మాయి డిఫరెంట్. వారందికి భిన్నంగా అవినీతి పరుడైన తన కాబోయే భర్తను నిర్దాక్షిణ్యంగా కటకటాలవెనక్కి తోసింది.
అవినీతిని సహించని ఈ లేడీ సబ్ ఇన్ స్పెక్టర్ విషయం దేశంలోని అందరికి స్ఫూర్తిదాయకం. అవినీతిపరుడు తనకు కాబోయే భర్త అయినా సరే క్షమించని ఈ లేడీ సబ్ ఇన్ స్పెక్టర్ కు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అస్సాంలోని నాగోన్ జిల్లా ఎస్ఐ జున్మోని రాభాకు ఆయిల్ ఇండియా లిమిటెడ్కు చెందిన పిఆర్ అధికారి అయిన రాణా పోగాగ్ తో పెళ్లి కుదిరింది.
ఇద్దరూ ఉద్యోగులు కావడంతో పెళ్లికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అయితే అంతలోనే ఒక ఫిర్యాదు వచ్చింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తప్పుడు సాకుతో అనేక మందిని కోట్లాది రూపాయలకు మోసగించిన ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు ఎవరిపైనో కాదు సాక్షాత్తూ తనకు కాబోయే భర్త పైనే…..
అయితేనేం మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినందుకు తనకు కాబోయే భర్తపై జున్మోని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తర్వాత కాబోయే భర్తను అరెస్టు చేసింది. గత అక్టోబరు నుంచి నిశ్చితార్థం చేసుకున్న వీరికి ఈ ఏడాది నవంబర్లో వివాహం జరగాల్సి ఉంది.
జున్మోనీని జనవరి 2021లో మజులీలో పోస్ట్ చేసినప్పుడు ఆమెను రాణా కలుసుకున్నాడు. వారి కుటుంబాల ఆశీర్వాదంతో కొన్ని నెలల తర్వాత నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమె నాగావ్కు బదిలీ అయిన తర్వాత అతనిపై అనుమానం కలిగింది. అతనికి ఉద్యోగం లేదని, తనకు దూరంగా ఉండటాన్ని భరించలేక అతను బదిలీ అయిన సిల్చార్లోని మరో ప్రదేశంలో చేరడానికి ఇష్టపడటం లేదని అబద్ధం చెప్పాడని ఆమెకు తెలిసింది.
“ముందుకు వచ్చి అతని కార్యకలాపాల గురించి నాకు తెలియజేసిన ముగ్గురు వ్యక్తులకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నా కళ్ళు తెరిపించినందుకు నేను కృతజ్ఞురాల్ని ”అని జున్మోని మీడియాతో అన్నారు. రాణా వద్ద నుంచి నకిలీ ముద్రలు, తప్పుడు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను ఇప్పుడు 2 రోజుల పోలీసు కస్టడీలో ఉన్నాడు.