38.2 C
Hyderabad
May 2, 2024 21: 00 PM
Slider ఆధ్యాత్మికం

కామన్పవలస ఆశ్రమం లో సద్గురు ఆది శంకరుల జయంతి..!

#shankarajayanti

విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి జన్మదినం జరిగింది. ఏటా వైశాఖ శుద్ధ పంచమి ఆర్ద్ర నక్షత్రం రోజున జగద్గురువు ఆదిశంకరులు జయంతి సందర్భంగా ఆశ్రమ పీఠాథిపతి ,వైద్య ఆరోగ్య శాఖలో రీజనల్ జాయంట్ డైరెక్టర్ గా పని చేసి పదవీ విరమణ పొందిన డా.వీ.వెంకటేశ్వరరావు శ్రీవారి గురూజీ అనుగ్రహభాషణం చేసారు.

ఈ సందర్భంగా శ్రీగురూజీ… జయంతి కి వచ్చిన శిష్యులనుద్దేశించి మాట్లాడారు. ఆది శంకరుల జయంతి నేపథ్యంలో ఉపనిషత్తులు, యోగవశిష్ఠ ,భగవద్గీత లో కొన్ని అధ్యాయాలను అందులో సారాన్ని అరటి పండు వలచి నోట్లో పెట్టినట్లు గా తెలియజేసారు.

ఇదిలా ఉంటే శ్రీ గురూజీ ఆదేశాలతో యావత్ ప్రపంచం…ఆశ్రమంలో ఆదిశంకరులు జయంతి ని వీక్షించే విధంగా అంతర్ముఖ.కామ్ తో యూ ట్యూబ్ లింక్ ద్వారా లండన్ లో ఉంటున్న శ్రీ గురూజీ శిష్యురాలు ఉషా భారతి చర్యలు తీసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు యూట్యూబ్ ద్వారా సోదర శిష్యులు కామన్నవలసలో ఆదిశంకరులు జయంతి ని వీక్షించారు.

Related posts

విజయవంతంగా జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం

Satyam NEWS

ఈ నెల 10న పాక్షిక చంద్ర గ్రహణం.. ఈ ఏడాది మరో రెండు

Satyam NEWS

ప్రజలు బాగుపడాలంటే బిజెపికి ఓటు వేయాలి

Satyam NEWS

Leave a Comment