“సత్యం న్యూస్. నెట్” పరిశోధన లో వెలుగు చూసిన నిజం లాంటి “సత్యం” .
విజయనగరం ఆర్మర్డ్ రిజర్వ్ లో పని చేసే గోవింద్… గురించే “సత్యం న్యూస్. నెట్”..క్యాప్షన్ ఇచ్చింది. పోలీసు శాఖలో కానిస్టేబుల్ స్థాయి నుంచీ ప్రస్తుతం ఏఆర్ విభాగంలో ఎస్ఐ స్థాయి కి చేరుకున్న గోవింద్… లేకుండా ఇంతవరకు ఏ ఒక్కరూ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఎగురవేయలేదంటే నమ్ముతారా…? నమ్మాల్సిందే.
1998లో అప్పటి విజయనగరం జిల్లా ఎస్పీ జయరామిరెడ్డి సమయంలో ఎస్పీ బంగ్లాలో… గార్డ్ గా ఉండే గోవింద్… తదనంతరం ఎస్పీ లుగా వచ్చిన మాదిరెడ్డి ప్రతాప్, సౌమ్య మిశ్రా…ఆ తర్వాత స్వాతి లక్రా..నవీన్ గులాటీ..ఇలా ప్రస్తుత ఎస్పీ దీపికా వరకు అందరు జిల్లా పోలీసు బాస్ లను చూసిన ప్రస్తుత ఏఆర్ ఎస్ఐ గోవింద్.. 13 ఏళ్లుగా పరేడ్ గ్రౌండ్ లో వచ్చిన ప్రతీ కలెక్టర్, ఎస్పీ లకు….జెండా ఎగురవేయడంలో…వృత్తి ధర్మంగా… ఏఆర్ ఎస్ఐ లేనిదే… ఎవ్వరూ జెండా ఎగురవేయలేదు.
మరో మూడేళ్ళ లో పదవీ విరమణ పొందబోతున్న ఏఆర్ ఎస్ఐ గోవింద్… పోలీసు శాఖలో తన దైన ముద్ర వేసుకున్నారని అంటోంది…. “సత్యం న్యూస్. నెట్.”
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా