అనాథ,అభాగ్యులు ఆకలితో అలమటిస్తూ ఎక్కడ ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టి ఆదుకోవాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.
బుధవారం మధ్యాహ్నం తస్లీమా ఓ అనాథ వృద్దుడికి తన సహస్తాలతో అన్నం తినిపించి మానవత్వం చాటుకున్నారు.
తస్లీమా ఉద్యోగరీత్యా ఉదయం హన్మకొండ నుండి ములుగు వస్తున్న క్రమంలో మల్లంపల్లి సమీపంలో ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు ప్రక్కన ఓ అనాథ వృద్ధుడు ఆకలికి తాళలేక ఎంగిలి విస్తారాకులు నాకుతూ దీనస్థితిలో ఉండటాన్ని బస్సులో ఉన్న తస్లీమా గమనించి చలించిపోయారు.
మధ్యాహ్న సమయంలో తన వెంట తెచ్చుకున్న లంచ్ బాక్స్ తీసుకొని ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళి అన్నం పెట్టగా అతని చేతికి గాయం అయి తినలేకపోయాడు.
గాయాన్ని గమనించిన తస్లీమా అతడి మొహం కడిగి తన సహస్తాలతో అన్నం తినిపించి మానవత్వం చాటుకున్నారు.
అనంతరం తస్లీమా మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తూ ఎవరు కనబడిన ఎలాంటి ప్రతిపలాపేక్ష లేకుండా ఆకలితో ఉన్నవారికి పెట్టేడు అన్నం పెట్టీ ఆదుకోవాలని తస్లీమా కోరారు.
ఇతరుల ఆకలిని తీర్చడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదు అని ఆమె అన్నారు. అనాధ,అభాగ్యులు ఎక్కడ కనిపించిన వారిని ఆదరించి,అన్నం పెట్టండి అని తస్లీమా కోరారు.