మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో భారత్ బయోటెక్ వారి కోవ్యాక్సిన్ 81 శాతం మెరుగైన ఫలితాలు చూపింది.
ఈ విషయాన్ని భారత్ బయోటెక్ నేడు వెల్లడించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో మొత్తం 25,800 మందిని వినియోగించారు.
దేశవ్యాప్తంగా చేసిన ఈ ప్రయోగంలో 81 శాతం మెరుగైన ఫలితాలను చూపించినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
ఐసిఎంఆర్ తో కలిసి ఈ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.
కరోనా నిర్మూలనలో తమ వ్యాక్సిన్ ఎంతో సమర్ధంగా పని చేస్తున్నట్లు వెల్లడి కావడం పట్ల భారత్ బయోటెక్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ యల్లా సంతోషం వ్యక్తం చేశారు.