ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా కమిషనర్ M.చంద్రశేఖర్ గౌడ్ నేడు హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు.
హుజూరాబాద్ వాహనాల అధికారి సిరాజ్ ఉర్ రహ్మన్ ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందచేశారు.
హుజూరాబాద్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం హుజూరాబాద్ వాహన తనిఖీ అధికారి కార్యాలయం సందర్శించి పలు విషయాలను చర్చించి రికార్డులను పరిశీలించారు.
సంబంధిత విషయాలు పరిశీలించిన అనంతరం ఆయన సిబ్బందిని అభినందించారు.
వేసవికాలం దృష్ట్యా సేవల కోసం వచ్చే వాహనదారులకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆయన సూచనలు చేశారు. కార్యాలయ ఆవరణంలో ఆయన మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.