ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది.
తిరుపతి, కడప, కర్నూలు, నంధ్యాల, విజయవాడ, పల్నాడు, గుంటూరు, పశ్చిమ ప్రకాశం, పశ్చిమ నెల్లూరు జిల్లాల్లో ఎండల తీవ్రత 44-46 మధ్యలో ఉండనుంది.
హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలను తాకనుంది. ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో వైపున కోస్తాంధ్ర భాగాలు విశాఖ, కాకినాడ, అమలాపురం, నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నంలో ఉష్ణోగ్రతలు 37 – 40 మధ్యలో ఉండనుంది. కానీ ఉక్కపోత విపరీతంగా ఉంటుంది.
సాయంకాలం కొన్ని చోట్ల వర్షాల వల్ల ఉపశమనం ఉంటుంది