37.2 C
Hyderabad
April 30, 2024 11: 21 AM
Slider గుంటూరు

నూతన సంవత్సర వేడులక బహిష్కరణ

chadalawada

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు బాసటగా త్వరలో గుంటూరు జిల్లా నియోజకవర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు సంఘీభావంగా జనవరి 1వ తేదీన జరుపుకోవాల్సిన కొత్త సంవత్సరం వేడుకలను బహిష్కరిస్తున్నట్లు నరసరాపుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, జేఏసీ కన్వీనర్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.

ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరికి వారు పొంతనలేని ప్రకటనలు చేస్తూ అమరావతిని స్మశానంతో, ఎడారితో పోలుస్తున్నారని ఆయన అన్నారు. వైసిపి మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. రైతులు, రాష్ట్ర ప్రజానీకం సంఘటితంగా పోరాడితే వైసిపి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వీలుంటుందని ఆయన అన్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అరవిందబాబు అన్నారు.

Related posts

తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా అల్లం ప్రభాకర్ రెడ్డి

Satyam NEWS

ట్యాంక్ బండ్ పై భగీరథుడి విగ్రహం

Satyam NEWS

యాంటీ జగన్: మూడు రాజధానులకు బిజెపి వ్యతిరేకం

Satyam NEWS

Leave a Comment