ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న వరదతో.. భద్రాచలం వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు పంటలకు జీవం పోశాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షసూచన ఉన్నందున హైదరాబాద్లో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.