భద్రాచలం వద్ద గోదావరి వరద 43.10 అడుగులకు చేరినట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 36 వేల 996 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. భద్రాచలంలో 43 అడుగులు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు.
ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లు కు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.