గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్గాల కారణంగా హప్సిగూడ డివిజన్ లోని పెద్ద చెరువు లోతట్టు ప్రాంతాల వరదలకు నష్టపోయిన కాలనీలలో సహాయక బృందాలతో కలిసి కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వాసులకు అండగా ఉంటామని, లోతట్టు ప్రాంతాలలో కిందటి సంవత్సరం జరిగిన నష్టం పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో అధికారాలు రాజమ్మ, ఇంజినీరింగ్ అధికారులు డిఈ రాములు, సులోచన, ఎఈ.పవన్కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు కక్కిరేణి హరీష్, సంజయ్ పటేల్, న్యాలకొండ సుమన్రావు, రంగా, రవి, చింతకింద ప్రవీణ్, పాశం ప్రవీణ్, కాలనీవాసులు అన్నం రాఘవరెడ్డి, జి.భరత్ ,వేముల వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.