42.2 C
Hyderabad
May 3, 2024 18: 41 PM
Slider ముఖ్యంశాలు

మాన్సాస్ చైర్మ‌న్ ఆదేశాల‌నుపాటించాల్సిందే: హైకోర్టు

#ashokgajapatiraju

కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

తన ఆదేశాలను ఈవో పాటించడం లేదని ఛైర్మన్ అశోక్ గజపతిరాజు వేసిన పిటిషన్ పై హైకోర్టు  స్పందించింది. అలాగే ఛైర్మన్ ఆదేశాలను ఈవో ఉల్లంఘించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈవో వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఈవో యొక్క విధులు, పనులు ఏమిటని ప్రశ్నించింది. మాన్సాస్‍లో ఆడిట్ పేరుతో ఇతరులు జోక్యం చేసుకోరాదని తెలిపింది.

జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని పేర్కొంది. అశోక్ గజపతిరాజు తరపున న్యాయవాదులు సీతారామమూర్తి, అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు.

Related posts

వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేతన్నలకు చేయూత

Satyam NEWS

‘ఆహా’లో వావ్ అనిపిస్తున్నవిక్రమ్ లగడపాటి “వర్జిన్ స్టోరీ”

Bhavani

బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే: పన్నాల దేవేందర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment