కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తన ఆదేశాలను ఈవో పాటించడం లేదని ఛైర్మన్ అశోక్ గజపతిరాజు వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. అలాగే ఛైర్మన్ ఆదేశాలను ఈవో ఉల్లంఘించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈవో వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఈవో యొక్క విధులు, పనులు ఏమిటని ప్రశ్నించింది. మాన్సాస్లో ఆడిట్ పేరుతో ఇతరులు జోక్యం చేసుకోరాదని తెలిపింది.
జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని పేర్కొంది. అశోక్ గజపతిరాజు తరపున న్యాయవాదులు సీతారామమూర్తి, అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు.