విద్యలనగరమా… దొంగల నగరమా…? ఈ ప్రశ్నలే విజయనగర ప్రజలను వేధిస్తున్నాయి. వారం రోజుల క్రితం టూటౌన్ స్టేషన్ పరిధి ఓరుగంటి వారి తోట లో దొంగతనం జరిగి దాన్ని నుంచీ నగర ప్రజలు ఇంకా తేరుకోక మునుపే మరోసారి దొంగలు పంజా విసిరారు.
సేమ్ స్టేషన్ పరిధి స్థానిక దాసన్నపేట మెయిన్ రోడ్డు వద్ద ఉన్న ఫోటో స్టూడియో లో దొంగతనం చేసారు గుర్తు తెలియని వ్యక్తులు. వారం రోజులు క్రితమే దాసన్నపేట మెయిన్ రోడ్డు పక్కన ఓ రుగంటివారి తోట వద్ద ఒక ఇంటిలో దొంగతనం చేసిన దొంగలు తిరిగి , అదే ఇంటికి కూతవేటు దూరం లో ఉన్న ఫోటో స్టూడియో లో తాజాగా మరో దొంగతనం చేసి పట్టుకోండి చూద్దం అంటూ పోలీసులకు సవాలు విసిరారు.
ఆ ఫోటో స్టూడియోలో.. కెమెరా, ఎల్.ఈ. డి టీవీ, నగదు అపహరించారు…గుర్తు తెలియని వ్యక్తులు. అయితే గడచిన కొద్ది రోజల నుంచీ మెయిన్ రోడ్లపై ఉన్న ఇండ్లు,షాపులపైనే గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలను పాల్పడుతున్నారు.
సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు…ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ మేరకు టూటౌన్ సీఐ లక్ష్మణరావు అందిన ఫిర్యాదు మేరకు తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు.