తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు సార్లు గ్రూప్ – 1 పరీక్షలు రద్దు అయినట్లు తెలిసింది. హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ – 1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.హాల్ టికెట్ నెంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానo పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. జూన్ 11వ తేదీన జరిగిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.