రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులకు తాము సిద్ధమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను చూస్తానని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తి రేకిస్తున్నాయి. కాకినాడ పర్యటనలో బిజిబిజీగా ఉన్న ఆయన శుక్రవారం నాడు అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ పొత్తుల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిఉందని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమేనని ఈ సందర్భంగా చంద్రబాబు తేల్చిచెప్పేశారు.