త్రిబుల్ వన్ జీవో (జీవో నెం111) అతిక్రమిస్తూ ఫామ్ హౌస్ నిర్మాణం చేశారనే అంశంపై గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి విచారణ నోటీసు అందుకున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.
ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేటీఆర్ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఇది రాజకీయ కక్షపూరిత పిటిషన్ అని ఆయన పేర్కొన్నారు. పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఫాంహౌజ్తో ఎలాంటి సంబంధం లేని తనకు ఎన్జీటీ నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ నిర్ణయం తీసుకోవడం ఘోర తప్పిదమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్జీటీ ఉత్తర్వులుపై స్టే విధించాలన్న కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు