నల్లగొండ జిల్లా షీ టీమ్ పోలీసులను తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పలువురు యువతులు, మహిళలను టార్గెట్ చేసుకొని లైంగికంగా వేధిస్తున్న అఖిల్ అలియాస్ చందును అత్యంత చాకచక్యంగా ఆరెస్ట్ చేయడంలో నల్లగొండ షీ టీమ్, వన్ టౌన్ పోలీసులు, ఐటి సెల్ సిబ్బంది సిబ్బంది పనితీరును ఆయన ట్విట్టర్ ద్వారా అభినందించారు.
తెలంగాణ పోలీస్ శాఖ మహిళల రక్షణ ప్రధాన ధ్యేయంగా పని చేస్తూ షీ టైమ్స్ ఆధ్వర్యంలో నిరంతర నిఘాతో మహిళలకు, యువతులకు, విద్యార్థినీలకు రక్షణ కల్పిస్తున్నదని చెప్పారు. 2020 సంవత్సరాన్ని మహిళా రక్షణ సంవత్సరంగా నిర్ణయించిన క్రమంలో రాబోయే రోజులలో మరింత సమర్ధవంతంగా పని చేస్తూ మహిళల రక్షణపై నిబద్ధతతో పని చేయాలని సూచించారు.
అఖిల్ లాంటి సైకోలను అరెస్ట్ చేయడం ద్వారా తెలంగాణ పోలీస్ నిరంతరం రక్షణగా నిలుస్తుందన్న భరోసా కల్పించాల్సిన బాధ్యత షీ టీమ్స్ పై ఉన్నదని ఆయన చెప్పారు. మహిళల రక్షణలో రాజీ లేకుండా పని చేస్తూ ముందుకు సాగాలని కోరిన డిజిపి నల్లగొండ పోలీసులను, షీ టీమ్ ను అభినందించారు.