మావోయిస్టులకు నిషేదిత పేలుడు పదార్ధాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం ఏఎస్పీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం.. గోనెసంచితో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి గ్రామం వద్ద పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడిని విచారించగా మావోయిస్టు కొరియర్ మడకం హరి, బాబు అలియాస్ ఎర్రయ్యగా తేలినట్లు పేర్కొన్నారు. ఇతడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఉడుతమల్లా గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.
ఇతని వద్ద నుంచి జిలెటిన్ స్టిక్, డిటోనేటర్స్ , కార్డేక్ వైర్లను స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.