హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో హై టెక్ పేకాట రాకెట్ ను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. హై టెక్ పేకాట శిబిరం నిర్వహిస్తున్న నిత్యపు మురళి అనే వ్యక్తి తో పాటు 13 మందిని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లి ప్రాంతంలోని లోథా అపార్ట్ మెంట్ లో ఈ హైటెక్ పేకాట రాకెట్ నిర్వహిస్తున్నారు.
ప్రతినెలా లక్షన్నర రూపాయలకు లోధా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ రెంట్ కు తీసుకున్నారు. సంపన్నులు నివసించే ఈ లోధా అపార్ట్మెంట్లో స్వేచ్ఛగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వారిని వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసి నిత్యపు మురళి పిలిపిస్తాడు. ప్రతిరోజు లక్షల్లో పేకాట నిర్వహిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి లోధా అపార్ట్మెంట్ లో హైటెక్ పేకాట జరుగుతున్నది.