ఆంధ్రాలో భీమ్లానాయక్ చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటే అభిమానులు ఆగుతారా? పవన్ కల్యాణ్ అభిమానులు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజవర్గానికి తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో బెనిఫిట్ షో లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు పవన్ అభిమానులు చేరుకుంటున్నారు.
యానాం శ్రీ పద్మ, వీరేశ్వర థియేటర్ లో తెల్లవారుజామున 5.30గంటలకు భీమ్లా నాయక్ బెనిఫిట్ షో ప్రారంభం అయింది. బెనిఫిట్ షోలకు రూ.500 నుంచి రూ.700 వరకు టిక్కెట్ ధర పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. యానాంలోని థియేటర్లలలో మాత్రమే బెనిఫిట్స్ షో వేయడంతో భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు తరలి వచ్చిన పవన్ అభిమానులతో థియేటర్ సమీపంలోని రోడ్లన్నీ వాహనాలను, కార్ల తో కిక్కిరిశాయి.