కళలకు కాణాచి, సంగీత విద్వాంసులకు పుట్టినిల్లు అయిన విజయనగరం జిల్లా కేంద్రంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందూస్తానీ సంగీత కచేరీ జరిగింది. ఒడిషా బోర్దర్ అయిన పర్లాకిమిడి కిచెందిన లతామంగేష్కర్ అవార్డు గ్రహీత,మద్య ప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కు చెందిన వాణీరావుచేహిందూస్తానీ సంగీత కచేరీ జరిగింది.
ఇక విజయనగరానికి చెందిన దామోదరరావు హార్మోనియం, ప్రవీణ్ కీ బోర్డు, రాజు తబలా పైన ,పాడ్స్ పై విజయకుమార్ తమ, తమ వాయిద్యాలతో వాణీరావు కచేరికి పక్కవాయిద్యాలుగా అందించారు. రాముడు,కృష్ణుడు,గురుగోవింద్ డు, భక్త కబీర్ దాస్,ఇలా పలువురిపై కచేరీలు పాడి శ్రోతలను మంత్రముగ్దులను చేసారు.
ఆద్యంతం కార్యక్రమం..ఆసక్తిగా సాగింది.ఈ సంగీత కచేరికి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, బీజేపీనేత బవిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డిలతో పాటు సంస్థ అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావు,కార్యదర్శి డా.మండపాకరవి,ఉమామహేశ్వరరావు, డా. అయ్యగారి రాఘవరావు,అబ్బులు ,దేవరాజు గోపాలకృష్ణ, నేమాన రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.