దారుణమైన ఈ ఘటన రాజమహేంద్రవరం ఆనంద నగర్ లో ఆదివారం రాత్రి జరిగింది. పూరేటి లక్ష్మీ అనూష (28) కు 13 ఏళ్ల క్రితం తాడేపల్లిగూడెంకు చెందిన రామ్ లక్ష్మణ తో వివాహం జరిగింది.
ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత భర్త ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి ఆమె రాజమండ్రి వచ్చి బ్యూటీషియన్ గా పనిచేస్తూ మరో వైపు వడ్డీ వ్యాపారాలు నడుపుతోంది. ఏడాది క్రితం రామచంద్రాపురం కి చెందిన జొన్నలగడ్డ రామకృష్ణను ఆమె మళ్లీ వివాహం చేసుకున్నది.
రామకృష్ణ పోలవరంలో నివాసం ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా సీతంపేట కు చెందిన సతీష్ అనే వ్యక్తి తో ఆమె సహజీవనం కొనసాగిస్తోంది. తరచు పిల్లలను హింసకు గురి చేస్తుండటంతో పిల్లల్ని కొట్టద్దని అడ్డొచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను అనూష గాయపర్చింది.
దాంతో తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై లక్ష్మి అనూష సోదరులు వారి మేనమామకు సమాచారం అందించడంతో వారు అనుషను ఫోన్ చేసి మందలించారు. దాంతో ఇద్దరు పిల్లలను ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసి హత్య చేసింది. అనంతరం ఉరితాడు చాకుతో కోసి పిల్లలను మంచం మీద పడుకోబెట్టి ఆమె ప్రియుడు సతీష్, సోదరులకు ఫోన్ చేసింది.
వారు ఆగమేఘాలపై ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో ఇట్లు ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడతుండగా వారు నిరోధించారు. అనంతరం చనిపోయిన పిల్లల్ని, అనుష్కను 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సమాచారం తెలిసిన త్రీటౌన్ సీఐ మధుబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి అయినా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘతుకానికి పాల్పడిన లక్ష్మి అనూషను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లి ముత్యం కనకదుర్గ డిమాండ్ చేస్తోంది.