39.2 C
Hyderabad
May 4, 2024 20: 44 PM
Slider గుంటూరు

హెల్ప్ చేయాల్సిన హోం గార్డే బాలికను కాటేశాడు

#Minor Girl Kidnapped

గుంటూరు జిల్లా తెనాలి ముత్యంశెట్టిపాలెంకు చెందిన 14 ఏళ్ల బాలికను గత నెల 26న కిడ్నాప్ చేసి రెండు వారాల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కేసు నమోదైన 24 గంటల్లో తెనాలి పోలీసులు ఆ కేసును ఛేదించారు.

ఈ సందర్భంగా తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి తెనాలి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. పొన్నూరు సమీపంలోని కర్లపాలెం చెందిన నూతలపాటి నవీన్ కుమార్ ,పద్నాలుగేళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, చందోలు దగ్గర ఇంటూరు లాకు దగ్గరికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు.

అనంతరం తెనాలి వైకుంఠపురం దగ్గర వదిలి వెళ్ళాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళితే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో అర్థరాత్రి స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు ఆ మైనర్ బాలిక పేరేచర్ల చేరుకుంది. అదే సమయంలో హోం గార్డ్ అశోక చక్రవర్తి, అతని స్నేహితుడు మైనర్ బాలికను వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో బాలిక భయాందోళనకు గురి కావడంతో, వెంటనే హోంగార్డ్ తన ఐడి కార్డు చూపించి, భయపడాల్సిన అవసరం లేదని,  ఎక్కడికి వెళ్లాలో చెప్తే తాను తీసుకువెళ్తానని నమ్మబలకగా..ఆ మైనర్ బాలిక వివరాలు చెప్పింది. తదనంతరం ఆ బాలికను హోంగార్డు వాహనంపై తీసుకుని వెళ్లి ఒక గదిలో నిర్బంధించి, తనతోపాటు స్నేహితులతో కలిసి అతిక్రూరంగా రెండు వారాల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ మైనర్ బాలిక మనోధైర్యాన్ని కోల్పోకుండా ఈనెల 13న వారి చెర నుండి తప్పించుకొని, తెనాలిలోని తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. జరిగిన సంఘటనలు తల్లిదండ్రులకు పూర్తిగా వివరించింది. కంగారుపడిన తల్లిదండ్రులు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన తెనాలి పోలీసులు  ఫిర్యాదు చేసిన 24 గంటల్లో కేసును ఛేదించారు. నిందితులు గుంటూరు అర్బన్ పోలీస్ పరిధిలో హోంగార్డుగా పని చేస్తున్న అశోక చక్రవర్తి, అతని స్నేహితుడు,దుర్గారావును అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారణ జరుపగా నిందితులు చేసిన తప్పును ఒప్పుకున్నారు.

బాధితురాలు ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై నిర్భయ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెనాలి డిఎస్పి కె.శ్రీలక్ష్మి మీడియా సమావేశంలో తెలిపారు. ఏదిఏమైనా మహిళలు జాగ్రత్తగా ఉండాలని, బాలికలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, డిఎస్పి శ్రీలక్ష్మి హెచ్చరికలు జారీచేశారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సిఐ రాజేష్ కుమార్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జనవరి 18 నుంచి మారుతున్న జగన్ జాతకం

Satyam NEWS

చంద్రబాబును కట్టడి చేయలేకపోతున్న జగన్

Satyam NEWS

ఉద్యమకారులు రోడ్డుపై.. ద్రోహులు మంత్రివర్గంలో..

Satyam NEWS

Leave a Comment