నిరుద్యోగ భృతి, ఉద్యోగ అవకాశాలను కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని హుజూర్ నగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా నియమితులైన గంగసాని యల్లారెడ్డి, కార్యదర్శి తురక గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువకులను నిర్వీర్యం చేసిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని వారు ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి ఈడుపుగంటి సుబ్బారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్, INTUC జాతీయ సంయుక్త కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.