38.2 C
Hyderabad
May 1, 2024 21: 31 PM
Slider నిజామాబాద్

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు కరోనా

#MLAJajulaSurendar

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. దాంతో కార్యక్రమాలలో పాల్గొన్న వారిలో ఆందోళన మొదలైంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కరోనా బారిన పడ్డారు.

లక్షణాలు కనిపించడంతో నిన్న ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆయనతో పాటు అంగరక్షకులు, కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా 8 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలుస్తోంది.

ఇటీవల రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు అంగరక్షకులకు సైతం కరోనా రావడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఎమ్మెల్యే చికిత్స పొందుతున్నారు.

Related posts

ఘనంగా జగనన్న క్రీడా సంబరాల ప్రైజ్ మనీ పంపిణీ

Satyam NEWS

ఏపి లో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న ప్రభుత్వోద్యోగులు

Satyam NEWS

కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేయడం మరచిపోయిన ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment