సమాజ అభివృద్ధిలో జర్నలిస్ట్ పాత్ర ఎంతో కీలకమైనదని హుజూర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో ఇటీవల పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు TVL, దయాకర్ రెడ్డి,దేవరం రాంరెడ్డి, నూకల నరేందర్ రెడ్డి లకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.అభివృద్ధి సంక్షేమానికి జర్నలిస్టులు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సాగర్ ఎడమకాల్వకు కోట్లాది రూపాయల నిధులు కెసిఆర్ ప్రభుత్వం కేటాయించిందన్నారు. జర్నలిస్టులకు త్వరలోనే ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు.
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తామన్నారు. ప్రభుత్వం సంక్షేమానికి ప్రభుత్వానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.పట్టణంలో ఔటర్ రింగ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. మెయిన్ రోడ్డును పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మిషన్ భగీరథ పైపులైన్లు పూర్తి చేసి ప్రతి ఇంటికి నీరు అందిస్తామని తెలిపారు.
టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు, మండల పరిషత్ అధ్యక్షుడు గూడెపు శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ నాగేశ్వరరావు, చిట్యాల అమరనాధ్ రెడ్డి, అట్లూరి హరిబాబు,
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, బాచిమంచి గిరిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేశ్ ముఖ్ అరుణ్ కుమార్, ఫణికుమార్ రెడ్డి, నాగారపు పాండు,ములకలపల్లి శీతయ్య,పాలకూరి బాబు, దొంగరి వెంకటేశ్వర్లు,మేకల నాగేశ్వరరావు, ఖాకీ అజయ్ రెడ్డి, దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చావా వాసుదేవరావు(చిన్న),
సాయిరా గౌడ్, శేషమరాజు, పిల్లల మర్రి శ్రీనివాస్,కీత రామనాథం, రాంప్రసాద్ గౌడ్, శ్రీనివాస చారి, కుందూరు కోటిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి,రాళ్లబండి వెంకటరాజు,దాస నాగేశ్వరరావు, శ్రీమన్నారాయణ, భీమవరం వెంకటరెడ్డి, సైదా, జానిమియా, వెంపటి శ్రీనివాస్, అంజయ్య, వెంకటరెడ్డి, జెయస్ తదితరులు పాల్గొన్నారు.