విజయనగరం జిల్లా గుర్ల పీఎస్ పరిధిలో ముళ్ల పొదలలో అపస్మారక స్థితిలో పడి ఉన్న స్టూడెంట్ ఎవరన్పది పోలీసులు విచారణ ప్రారంభించారు.
సోషల్ మీడియాలో.. కొందరు పెట్టిన దృశ్యం ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్పీ ఉన్న పళంగా గుర్ల ఎస్ఐ లీలావతి ని ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించడమే కాకుండా..ఎస్పీ కూడా ఘటనా స్థలిని పరిశీలించారు. ఆఘమేఘాల మీద..విద్యార్ధిని వివరాలు కనుక్కునే యత్నం చేసారు.. పోలీసులు.
తెర్లాం కు చెందిన రమ అనే విధ్యార్థిగా గుర్తించిన పోలీసులు… బాధితురాలిని జిల్లా కేంద్రంలో ని మహారాజ హాస్పిటల్ కు తరలించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో… సీఐ మంగవేణి.. ప్రత్యేక విచారణ అధికారిణిగా నియమించినట్టు సమాచారం.