32.7 C
Hyderabad
April 26, 2024 23: 14 PM
Slider వరంగల్

ఎంజిఎం డాక్టర్ పై దౌర్జన్యం కేసులో ఎమ్మెల్యే పిఏ అరెస్టు

#MGM Warangal

వరంగల్ ఎంజిఎం లో జూనియర్ డాక్టర్లపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ ఎంజిఎం లో మంత్రి కేటీఆర్ పిఏ బంధువులమని చెప్పి కొందరు వ్యక్తులు జూనియర్ డాక్టర్ లపై దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. వాస్తవంగా అతను కేటీఆర్ పిఏ కాదు. హుస్నాబాద్ ఎమ్మెల్యే పిఏ అని తేలింది.

దాంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే పిలే వడ్డె చైతన్యపై కేసు నమోదు అయింది. శనివారం రాత్రి సాయి కృష్ణ అనే వ్యక్తి చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి వారు వచ్చారు. చికిత్స ఆలశ్యం చేస్తున్నారని ఆయన వచ్చిన చైతన్య జూనియర్ డాక్టర్ ను దుర్భాషలాడారు. దౌర్జన్యం చేశారు.

అక్కడే ఉన్న కుర్చీ ఎత్తి పడేశారు. పిజి డాక్టర్ సౌమ్య ఫిర్యాదు మేరకు పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారు.

Related posts

కేంద్ర నిర్ణయం ఉపసంహరణ: జైనుల పుణ్యక్షేత్రం యధాతధం

Satyam NEWS

సేవా సంస్థలకు మంతెన వెంకట రామరాజు విరాళం

Satyam NEWS

తెలంగాణ ముద్దు బిడ్డ

Satyam NEWS

Leave a Comment