దిశ హత్య కేసు దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోక్సభలో ఆయన దిశ ఘటనపై మాట్లాడారు. ‘ఈ ఘటన దేశం మొత్తం తలదించుకునేలా చేసింది. ప్రతి ఒక్కరినీ బాధించింది. దోషులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను నిలువరించేందుకు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం అని ఆయన అన్నారు.
ఉన్న చట్టాల్లో మార్పులు చేసే విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో పాటు పలువురు ఎంపీలు దిశ హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. దోషులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.