Slider కడప

లక్కీ ఛాన్స్: డిప్ ద్వారా ఇండ్ల నెంబర్లు కేటాయింపు

rajampet dip

రాజంపేట లో లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఇండ్ల నెంబర్లు కేటాయింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు. రాజంపేట పట్టణం లోని కళాంజలి గార్డెన్ లో జరిగిన సభలో ఇళ్ల స్థలాలకు సంబంధించి లాటరీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాజంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానంపాలక మండలి సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి , రాజంపేట మాజీ శాసన సభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , రాజంపేట ఆర్డిఓ ధర్మ చంద్రారెడ్డి , రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మున్సిపల్ సిబ్బంది వాలెంటర్ల్లు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి మాట్లాడుతూ పేదలందరికి ఇండ్లు కట్టించి ఇవ్వడమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని అన్నారు. గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వగా ఈ ఘనత నాడు వై.యస్.రాజశేఖర్ రెడ్డి కి నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందని అన్నారు.

Related posts

కాప్రా మునిసిపాలిటీలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ

Satyam NEWS

ఆర్మీ జవాన్ కి ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూమిని మింగేశారు

Bhavani

యూ.జి.సి.సర్య్కూలర్ వెనక్కి తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment