రాజంపేట లో లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఇండ్ల నెంబర్లు కేటాయింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు. రాజంపేట పట్టణం లోని కళాంజలి గార్డెన్ లో జరిగిన సభలో ఇళ్ల స్థలాలకు సంబంధించి లాటరీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానంపాలక మండలి సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి , రాజంపేట మాజీ శాసన సభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , రాజంపేట ఆర్డిఓ ధర్మ చంద్రారెడ్డి , రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మున్సిపల్ సిబ్బంది వాలెంటర్ల్లు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి మాట్లాడుతూ పేదలందరికి ఇండ్లు కట్టించి ఇవ్వడమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని అన్నారు. గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వగా ఈ ఘనత నాడు వై.యస్.రాజశేఖర్ రెడ్డి కి నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందని అన్నారు.