29.7 C
Hyderabad
May 3, 2024 06: 00 AM
Slider ఆధ్యాత్మికం

యాదాద్రికి పోటెత్తిన భక్తులు…

#yadadri

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు కార్తిక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. బ్రేక్ దర్శనానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో వెళ్లారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రతమండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. కార్తిక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుని దీపారాధన పూజల్లో భక్తులు పాల్గొన్నారు.

Related posts

క‌మ‌ల‌నాధులు ఒత్తిళ్లే..బ‌దిలీకి కార‌ణ‌మా..?

Satyam NEWS

బతుకు పాఠం

Satyam NEWS

బస్సు జాతాను జయప్రదం చేయాలి

Bhavani

Leave a Comment