37.2 C
Hyderabad
May 6, 2024 12: 02 PM
Slider నల్గొండ

అరుదైన శస్త్ర చికిత్స చేసి 4కిలోల కణితి తొలగించిన డాక్టర్ శివప్రసాద్

#srivenkateswaranursinghome

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర నర్సింగ్ హోమ్ డాక్టర్ శివప్రసాద్ రావూరు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హుజూర్ నగర్ నియోజకవర్గం వేపల మాదారం గ్రామానికి చెందిన షేక్ నూర్జా బేగం (55) కడుపు నొప్పి, రక్తస్రావంతో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర నర్సింగ్ హోమ్ లో చేరారు. అక్కడ వారు డాక్టర్ శివప్రసాద్ రావూరు ని సంప్రదించగా అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆదివారం నూర్జా బేగంకు ఆయన శస్త్ర చికిత్స చేశారు. సుమారు 4 కేజీల కణితిని (ఫైబ్రాయిడ్ యూట్రస్) విజయవంతంగా తొలగించి ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడారు. ఆపరేషన్ అనంతరం పేషెంట్ ఆరోగ్యంగా ఉందని డాక్టర్ శివప్రసాద్ సత్యంన్యూస్ కు తెలిపారు. పేషంట్ కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ శరత్ కుమార్,డాక్టర్ సుజాత,డాక్టర్ శివప్రసాద్,డాక్టర్ నాగరాజు,శ్రీ వేంకటేశ్వర నర్సింగ్ సిబ్బంది సుబ్బారావు,స్వరూప,సురేష్ , రాంబాబు,శ్రీకాంత్,నిజాం పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సీఎంతో మైక్రాన్​ కంపెనీ సీఈవో భేటీ

Satyam NEWS

శ్రీశైలం దేవస్థానంలో కోవిడ్ నివారణ చర్యలు

Satyam NEWS

5న రాత్రి 9 గంటలకు దీపం వెలిగించండి

Satyam NEWS

Leave a Comment