సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన పిడమర్తి అశోక్ సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు అశోక్ తెలిపారు.
కె.ఆర్.ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్ధి పిడమర్తి అశోక్ ప్రతిరోజు ఉదయం కబడ్డీ కోచ్ సునిల్ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకుంటూ కె.ఆర్.ఆర్ కాలేజీ నుండి యం.జి యూనివర్సిటీలో జరిగిన కబడ్డీ పోటీలలో మొదటి బహుమతి సాధించి సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు అశోక్ తెలిపాడు.
ఈ పోటీలు ఈనెల 23 నుండి 26వ,తేదీ వరకు తమిళనాడు లోని భారతీ దాస్ యూనివర్సిటీలో జరగనున్నట్లు అశోక్ తెలిపారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్