27.7 C
Hyderabad
May 12, 2024 04: 52 AM
Slider నల్గొండ

అభివృద్ధి పనులు పరిశీలించిన హుజూర్ నగర్ శాసనసభ్యుడు సైదిరెడ్డి

#saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 13,23 వార్డులలో స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను ఉద్దేశించి సైదిరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు వేరు,అభివృద్ధి వేరని రాజకీయ విమర్శలు చేసే వారు చేస్తూనే ఉంటారని,అభివృద్ధిలో మాత్రం ఏ మాత్రం రాజీపడే సమస్య లేదని అన్నారు. వార్డులలో డ్రైనేజీ సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చారని, ఖచ్చితంగా వాటన్నింటినీ పరిష్కరిస్తానని,23వ,వార్డు కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ప్రతి వార్డు కూడా అందంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం యొక్క ఉద్దేశమని అన్నారు.అవగాహన రాహిత్యం లేని వ్యక్తులు విమర్శలు చేస్తారని, అటువంటి వాటిని పట్టించుకోకుండా అభివృద్ధి మాత్రమే తమ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు,ఆయా వార్డు ప్రజలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కూలిన నాంప‌ల్లి స‌రాయి హెరిటేజ్ భ‌వ‌నం

Satyam NEWS

రైతుల పోరాటానికి కేంద్రం స్పందించకపోవడం శోచనీయం

Satyam NEWS

కబడ్డీ ఛాంపియన్  నల్గొండ

Murali Krishna

Leave a Comment