40.2 C
Hyderabad
April 29, 2024 16: 01 PM
Slider క్రీడలు

కబడ్డీ ఛాంపియన్  నల్గొండ

#kabaddi

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవాల్లో భాగంగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబడ్డీ  ఛాంపియన్ షిప్ ట్రోఫి విజయవంతంగా ముగిసింది .  హోరాహోరీగా  జరిగిన ఫైనల్ పోరులో పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు పై నల్గొండ జట్టు విజేతగా నిలిచింది. మహిళల విభాగంలో కూడా రంగారెడ్డి జట్టుపై నల్గొండ జట్టు  విజేతగా నిలిచింది. విజేతలుగా నిలిచిన పురుషుల విభాగం నల్గొండ జట్టుకు, మహిళా  విభాగం నల్గొండ జట్టుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఛాంపియన్ షిప్ ట్రోఫితో పాటు రూ. లక్ష నగదు ను మొదటి బహుమతిగా అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన పురుషుల రంగారెడ్డి జట్టు కు, మహిళల రంగారెడ్డి జట్టు కు రూ. 75 వేల చొప్పున నగదు బహుమతులుగా అందజేశారు. ఇరు విభాగాల్లోనూ నల్గొండ, రంగారెడ్డి జట్లు మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలవడం విశేషం.

మొదటి రెండు స్థానాల్లో కాకుండా తర్వాత ఆరు స్థానాల్లో నిలిచిన పురుషుల, మహిళల  జట్లకు కూడా నగదు బహుతులను అందజేశారు. తృతీయ స్థానం రూ. 50వేలు, నాల్గవ స్థానం రూ. 40వేలు, ఐదవ స్థానం  రూ. 30వేలు, ఆరవ స్థానం  రూ. 20వేలు, ఏడవ స్థానం రూ. 15వేలు, ఎనిమిదవ స్థానం లో నిలిచిన ఇరు విభాగాల జట్లకు రూ. 10వేలను నగదు బహమతులుగా అందజేశారు. అదేవిధంగా వ్యక్తిగత ప్రతిభతో ఆటలో రాణించిన ఉత్తమ రైడర్, ఉత్తమ డిఫెండర్లుకు సైతం నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. జగదీశ్వర్ యాదవ్, డీవైఎస్ వో పరంధామిరెడ్డి , కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తుంబూరు దయాకర్ రెడ్డి, పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, మద్దినేని బేబి స్వర్ణకుమారి , మట్టా దయానంద్, పిడమర్తి రవి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి,  పోటీల ఆర్గనైజర్ కటికల క్రిస్టోఫర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో ఐటీ సోదాలపై నివేదిక

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్‌?

Satyam NEWS

ప్రేక్షకుల అభినందనల్లో మునిగితేలిన ఐశ్వరరాయ్

Satyam NEWS

Leave a Comment