జాతీయ స్థాయిలో జరుగుతున్న అండర్ 25 క్రికెట్ మ్యాచ్ లకు హైదరాబాద్ జట్టు నుండి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఆల్ రౌండర్ యలక అవినాష్ గౌడ్ ఎంపిక అయ్యారు.
జనవరి 1వ,తేది నుండి జరుగుతున్న ఈ జాతీయ స్థాయి క్రికెట్ క్రీడలో ఆదివారం నాగాలాండ్ లో జరుగుతున్న మూడవ మ్యాచ్ లో అవినాష్ గౌడ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు నుండి ఆడనున్నారు.యలక అవినాష్ గౌడ్ హుజూర్ నగర్ లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో బి కామ్ కంప్యూటర్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.అవినాష్ గౌడ్ అండర్ 25 క్రికెట్ మ్యాచ్ కి ఎంపిక కావడం పట్ల ప్రియదర్శిని విద్యాసంస్థలు చైర్మన్ పశ్యా శ్రీనివాస రెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి రవీందర్ గౌడ్,ఉపాధ్యాయ బృందం తమ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మారు మూల ప్రాంతంలో పుట్టి జాతీయ స్థాయిలో క్రికెట్ లో రాణిస్తున్న యలక అవినాష్ గౌడ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.ఒక ప్రక్క విద్యలో రాణిస్తూ మరో ప్రక్క క్రీడా రంగంలో సత్తా చాటుతూ హుజూర్ నగర్ కు మంచి పేరు తెస్తున్న అవినాష్ గౌడ్ భవిష్యత్తులో ఇండియా క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్