విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం బంగారుమెట్ట వద్ద ఈ దుర్ఘటన జరిగింది. సికరి గ్రామానికి చెందిన లకే నీలకంఠం, బంగారుమెట్ట గ్రామానికి చెందిన కటారి రామేశ్వరి(25) ప్రేమించుకున్నారు.
గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న నీలకంఠం ను రామేశ్వరి బాగా నమ్మింది. పెళ్లి చేసుకుంటానని బాస చేశాడు. దాంతో రామేశ్వరి తన సర్వస్వాన్నీ అర్పించుకుంది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నీలకంఠం మరొక యువతితో పెళ్లికి సిద్ధ పడ్డాడు. దాంతో రామేశ్వరి మనస్థాపానికి గురి అయింది. పంట పొలాల్లోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రామేశ్వరి బంధువుల ఫిర్యాదు మేరకు ఎసై రాజారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.