తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి రెడ్డి గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయానికి విచ్చేసిన ఆయనను నియోజకవర్గ ఇన్-ఛార్జ్ డాllచదలవాడ అరవింద బాబు జి.వి రెడ్డిని దుశాలువాతో సత్కరించారు. ఇరువురు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ చేకూరి వీరయ్య,పార్లమెంట్ వాణిజ్య విభాగ అధ్యక్షులు మాజేటి వెంకటేష్, పార్లమెంట్ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు, మాజీ కౌన్సిలర్లు కదం నగజ్యోతి, కొర్నేపాటి సంజీవరావు, మీరవాలి, బొప్పుడి వెంకయమ్మ తదితరులు ఉన్నారు.
previous post