28.7 C
Hyderabad
May 5, 2024 23: 08 PM
Slider విశాఖపట్నం

భార్య పీక కోసి అదే కత్తితో ఆత్మహత్య చేసుకున్న భర్త

#murder

విశాఖ మన్యం చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయితీ రామారావు పాలెం గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లోతుగడ్డ పంచాయతీ రామారావుపాలెం గ్రామానికి చెందిన గెమ్మెలి గణపతి(37),భార్య గెమ్మెలి తులసి(36)ల మధ్య సోమవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది మద్యం మత్తు లో ఉన్న గణపతి భార్య పీక కోసి వేశాడు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు అన్నవరం పోలీస్ లకు సమాచారమందించారు. పోలీసులు తనను శిక్షిస్తారనే భయం తో వారు వచ్చే లోపల అతను కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతడిని చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు మృతి చెందాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఎస్ఐ ఎన్ ప్రశాంత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఫీడ్ బ్యాక్: స్వచ్ఛమైన నగరం కోసం ఓటు వేయండి

Satyam NEWS

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఈఎస్ఐ ఉచ్చు?

Satyam NEWS

చినుకు మొగ్గ తొడిగిన వేళ…!!!

Satyam NEWS

Leave a Comment