దుమ్ము ధూళితో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీంతో చాలామందికి శ్వాసకోశ సమస్యలు తలెత్తి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని రోడ్లపై పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అలాగే రోడ్లపై రోజుకు మూడుసార్లు నీరు చల్లితో దుమ్ము రేగకుండా ఉంటుందని హుజుర్ నగర్23వ వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య, మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్రెడ్డిలు కమిషనర్కు విన్నవించారు.
చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరిన కౌన్సిలర్లు
దుమ్ము ధూళి రేగకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున దుమ్ము పేరుకుపోయిందని వాహనాలు వెళ్లినప్పుడు వాటి వల్ల ధూళి రేగుతోందని అన్నారు. దీంతో పట్టణంలోని ప్రజలు అనేక రోగాల బారిన పడేందుకు కారణమవుతోందన్నారు. తమ విన్నపంపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కౌన్సిలర్లు కమిషనర్ను కోరారు.