33.7 C
Hyderabad
April 29, 2024 02: 08 AM
Slider ఆధ్యాత్మికం

నకిలీ లేఖలతో వేంకటేశ్వరుడి వద్దే మోసం

Tirumala.Venkateswara.Temple.original.3339

తిరుమల వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో రావాలి కానీ మోసం చేసి కాదు. కానీ కొందరు మాత్రం మోసం చేసే వస్తున్నారు. తాను ఐఆర్‌ఎస్‌ అధికారినని, ముంబయిలో ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నానంటూ గుంటూరుకు చెందిన వెంకటరత్నారెడ్డి నకిలీ లేఖలో శ్రీవారి దర్శనానికి వచ్చాడు.

ఆయన తీసుకువచ్చిన సిఫారసు లేఖలు నకిలీవని జేఈఓ కార్యాలయం సిబ్బంది గుర్తించారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ తంతును గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రత్నారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

గతంలోనూ ఇదే తరహాలో నకిలీ లేఖలతో రత్నారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. నకిలీ అధికారి బాగోతం బయటపడడంతో ఉన్నతాధికారులు సిఫారసు లేఖలను కూడా జేఈఓ కార్యాలయం సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Related posts

ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ రాజయ్య

Satyam NEWS

వివేకా హత్య కేసు నిందితుడికి బెయిల్ మంజూరు

Satyam NEWS

Ultimate Tragedy: కుప్పలు తెప్పలుగా…. కరోనా శవాలు

Satyam NEWS

Leave a Comment