హైదరాబాద్ మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి పదవీకాలం యేడాది పూర్తి చేసుకున్న సందర్బంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ప్రగతి పథంలో హైదరాబాద్ (2021 -2022) బుక్ ను మేయర్ , డిప్యూటి మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ టిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంథం నాగేశ్వరావు అభిమానం తో బుక్ ను మేయర్ కి అందించారు. ఈ సందర్భంగా గంథం నాగేశ్వరావు మాట్లాడుతూ హైదరాబాద్ మేయర్ గా ప్రజాసేవలో దిగ్విజయంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. నిత్య కృషీవలురాలు అయిన గద్వాల్ విజయలక్ష్మి అక్క కు హార్థిక శుభాకాంక్షలు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లో టిఅర్ఎస్ నాయకులు జగదీష్ కుమార్,శ్రీనివాస్ రెడ్డి,రవి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్