33.2 C
Hyderabad
May 4, 2024 00: 40 AM
Slider హైదరాబాద్

ప్రగతి పథంలో హైదరాబాద్ పుస్తకావిష్కరణ

#hyderabadmayor

హైదరాబాద్ మేయర్ గా  గద్వాల్ విజయలక్ష్మి  పదవీకాలం యేడాది పూర్తి చేసుకున్న సందర్బంగా మేయర్  గద్వాల్ విజయలక్ష్మి ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ప్రగతి పథంలో హైదరాబాద్ (2021 -2022) బుక్ ను మేయర్ , డిప్యూటి మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ టిఅర్ఎస్ పార్టీ సీనియర్  నాయకులు గంథం నాగేశ్వరావు  అభిమానం తో  బుక్ ను మేయర్ కి అందించారు. ఈ సందర్భంగా గంథం నాగేశ్వరావు మాట్లాడుతూ హైదరాబాద్ మేయర్ గా ప్రజాసేవలో దిగ్విజయంగా  సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. నిత్య కృషీవలురాలు అయిన గద్వాల్ విజయలక్ష్మి అక్క కు  హార్థిక శుభాకాంక్షలు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లో టిఅర్ఎస్ నాయకులు జగదీష్ కుమార్,శ్రీనివాస్ రెడ్డి,రవి తదితరులు  పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్

Related posts

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి

Satyam NEWS

10న జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం

Satyam NEWS

రాజధాని గ్రామాల మహిళలపై పోలీసు దాడి అమానుషం

Satyam NEWS

Leave a Comment