33.2 C
Hyderabad
May 4, 2024 02: 32 AM
Slider వరంగల్

నేరస్థులకు శిక్ష పడితే పోలీసులకు ప్రజలు మరింత దగ్గరవుతారు

నేరానికి పాల్పడిన కోర్టు శిక్ష విధించడం ద్వారా పోలీసులకు మరింత దగ్గరవుతారని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేటకు చెందిన సెంట్రల్ జోన్ పరిధిలో వివిధ నేరాలకు పాల్పడిన నేరస్థుల నేరాలను కోర్టులో నిరూపించి నేరస్థులకు శిక్షపడటంలో కీలకంగా నిలిచిన ప్రభుత్వ న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్ళను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది సెంట్రల్ జోన్ పరిధిలో జరిగిన వివిధ రకాల నేరాలకు పాల్పడిన నిందితుల్లో ముగ్గురు నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించగా మరో నిందితుడికి 8 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నిందితులకు శిక్ష పడటంలో ప్రతిభ కనబరచిన వరంగల్ ప్రాసిక్యూషన్ జాయింట్ డైరక్టర్ కె. అజయ్కుమార్, పబ్లిక్ ప్రాసీక్యూటర్

శ్రీనివాసరావు, ట్రాన్స్కో విజిలెన్స్ అధికారి ఎస్. జనార్ధన్, టాస్క్ఫోర్స్ ఏసిపి యం. జితేందర్ రెడ్డి, సైబర్ క్రైం ఇన్స్స్పెక్టర్ జనార్థన్ రెడ్డితో పాటు కోర్టు కానిస్టేబుళ్ళు వి. రాజు, యం. వీరస్వామి, ఏ.సుధాకర్, జి. జ్ఞానేశ్వర్లను పోలీస్ కమిషనర్ ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలను అందజేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరానికి పాల్పడిన నేరస్థుడికి నేరాన్ని నిరూపించేందుకుగాను అధికారులు, నైపుణ్యంతో కూడిన దర్యాప్తును నిర్వహించాలని, కోర్టులో నేరస్థుడికి శిక్ష పడ్డప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం, గౌరవం పెరుగుతాయని, అదే విధంగా కోర్టు కేసులపై పోలీస్ అధికారులు తరుచూ సమీక్షా జరపాలని, అదే విధంగా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సమన్వయం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు… ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్, లా అండ్ ఆర్థర్ అదనపు డిసిపి పుష్పారెడ్డి, సిసిఆర్బి ఇన్స్స్పెక్టర్లు కరుణాకర్, రమేష్తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

Related posts

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదే

Satyam NEWS

మహబూబ్ నగర్ కు మరో మణిహారం నెక్లెస్ రోడ్

Satyam NEWS

ఇప్పుడు ముస్లింలను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment