28.7 C
Hyderabad
April 26, 2024 10: 29 AM
Slider గుంటూరు

ఇప్పుడు ముస్లింలను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం

#Dr.Chadalawada

నంద్యాలలో సలాం కుటుంబసభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు.

నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు వేధింపులు మొన్నటి దాక దళితులపై, బీసీలపై ఇప్పుడు మైనార్టీలపై జరుగుతున్నాయని అన్నారు.

 రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఆపలేని పోలీసులు రాజీనామా చేయాలి. వైసిపి పాలనలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు.

ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. సభ్య సమాజం తలదించుకునే విధంగా వేధిస్తున్నారని ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే అర్థమవుతుంది అని ఆయన అన్నారు.

దాడులు,దౌర్జన్యాలు తో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. మైనార్టీల ,ఎస్సీ, ఎస్టీల, బీసీల మీద అణచివేత పనులు చేస్తే సహించేది లేదన్నారు.

ఈ సమావేశంలో గుడురు శేఖర్, అబ్దుల్ రజాక్, మీరావలి,కరిముల్లా,రఫీ,కాసిం, హుస్సేన్,సుభాని, భాష,మబు, ఖాసిం,అలి,ఖలీల్,మస్తాన్ పాల్గొన్నారు.

Related posts

వరంగల్‌లో అదృశ్యమైన పాతబస్తీ యువతి

Satyam NEWS

‘శ్రీసత్యసాయి అవతారం’ సినిమా షూటింగ్‌ ప్రారంభం

Satyam NEWS

శ్రీ కనక దుర్గా దేవి ఉత్సవాల్లో  ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment