42.2 C
Hyderabad
May 3, 2024 17: 37 PM
Slider వరంగల్

నిరాశా నిస్పృహలతోనే టీఆరెఎస్ కార్యకర్తల పై దాడులు

దేశంలో బీజేపీ పతనానికి మునుగోడు నియోజకవర్గం నాందీ ప్రస్తావన కానుందని, బీజేపీకి మునుగోడులో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆ నిరాశా నిస్పృహలకు లోనై, టీఆరెఎస్ కార్యకర్తల మీద దాడులకు దిగుతుందని, జాస్వామ్యంలో దాడులకు తావులేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగడాన్ని మంత్రి ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదన్నారు. బీజేపీ ప్రేరేపిత దాడులకు భయపడేది లేదని, అయితే,

టీఆరెఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని, దానికి తగ్గట్లుగా ఎవరి భావాలను, విధానాలను స్వేచ్ఛగా వెల్లడించుకోవాలే తప్ప, ఇలా భౌతిక దాడులకు దిగడం అనైతికం అన్నారు. TRS పార్టీ కార్యకర్తలు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో శాంతి యుత వాతావరణం ఉండాలని కోరుకున్నారు. నుగోడు ఉప ఎన్నికల్లో TRS పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు.

Related posts

శివోహం: శివరాత్రి పూజల్లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే

Satyam NEWS

ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల ఎవ‌ర్‌గ్రీన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Satyam NEWS

మాటల మాంత్రీకుడు దర్శకుడిగా మారి 20 ఏళ్ళు

Satyam NEWS

Leave a Comment