పౌరసరఫరాలకు సంబంధించి ఎటు వంటి సమస్య ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి సమస్యలను వివరించవచ్చని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ కోరారు. టోల్ ఫ్రీ నంబరు 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని ఆయన అన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ధాన్యం కొనుగోళ్లు, లీగల్ మెట్రాలజీ, కన్స్యూమర్ ప్రొటెక్షన్, తదితర సమస్య లపై ఈ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అవకాశాన్ని వినియోగించుకోని సమస్యలు ఉంటే తెలిపి పరిష్కారం పొందాలని ఆయన అన్నారు.